వేరుశనగ పంట రైతులకు న్యాయం చేయండి: వైఎస్ అవినాష్

4 Jun, 2014 22:55 IST|Sakshi
వేరుశనగ పంట రైతులకు న్యాయం చేయండి: వైఎస్ అవినాష్

న్యూఢిల్లీ: వేరుశనగ పంట నష్ట పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎండీ జోసఫ్ కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వినతి చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ బీమాకంపెనీ ఎండీ జోసఫ్‌తో అవినాష్ రెడ్డి చర్చించారు.

వైఎస్ అవినాష్ రెడ్డి సూచనకు ఎండీ జోసఫ్‌ సానుకూలంగా స్పంధించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని బీమా కంపెనీ ఎండీ జోసఫ్ హామీ ఇచ్చారని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వేరుశనగ పంట కారణంగా జిల్లాలోని పలు రైతులు నష్టాలకు గురయ్యారు.

మరిన్ని వార్తలు