సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చీరాల నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం చీరాల శివారు నుంచి వైఎస్ జగన్ 109వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కొత్తపేట, ఆంధ్రకేసరి జూనియర్ కాలేజీ, బాలాజీ థియేటర్, పేరాల, ఐటీసీ మీదుగా ఆదినారాయణపురం చేరుకుని రాజన్న భోజన విరామం తీసుకుంటారు.
పాదయాత్ర మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతుంది. అనంతరం ఈపురుపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈపురుపాలెంలో వైఎస్ జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. రాత్రి జననేత ఇక్కడే బస చేస్తారు. ఈపురుపాలెంలో వైఎస్ జగన్ జనంతో మమేకం కానున్నారు. దారిపొడవునా ప్రజలు రాజన్న బిడ్డకు నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో ఇప్పటి వరకు జననేత 1462 కిలోమీటర్లు నడిచారు.