215వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

17 Jul, 2018 21:30 IST|Sakshi

సాక్షి, కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 215వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 

వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ మండలం కొవ్వాడ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఛీడిగా మీదుగా ఇంద్ర పాలెం చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కాకినాడ ఏఆర్‌సీ సెంటర్‌, సంతచెరువు, కల్పన సెంటర్‌, కోకిల సెంటర్‌ మీదుగా ఆధిత్యా కళాశాల సెంటర్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి రాజన్న బిడ్డ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు