243వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం 

23 Aug, 2018 08:38 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 243వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దార్లపూడి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక, పద్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్తమపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు