285వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

13 Oct, 2018 19:38 IST|Sakshi

సాక్షి, గజపతి నగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 285వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. ఆదివారం ఉదయం జననేత గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కోమటిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాడేందొరవలస క్రాస్‌, కౌండినవలస క్రాస్‌, మరదం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సికారుగండి క్రాస్‌, కె.కొత్తవలస క్రాస్‌, ఎస్‌. బుర్జావలస వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 284వ రోజు పాదయాత్ర శనివారం కోమటిపల్లి వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర గజపతినగరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గంలోని మధుపాడు, భూదేవీపేట క్రాస్‌, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్‌, గుడివాడ క్రాస్‌, మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లి వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగింది. నేటి ప్రజాసంకల్పయాత్రలో జననేత 10.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,135.5 కిలోమీటర్ల పాదయాత్రను రాజన్న తనయుడు పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు