సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 331వ రోజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మిళియపుట్టి నైట్ క్యాంప్ శిబిరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి, పట్టుపురం, జోడూరు క్రాస్, రామచంద్రాపురం క్రాస్, జాడుపల్లి, పదనపురం క్రాస్, ఎస్. జాడుపల్లి క్రాస్ మీదుగా రంగడి గటి క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రజాసంకల్పయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.