ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

15 May, 2019 19:15 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా :  వైఎస్సార్‌సీపీ నాయకుడు రసూల్‌ సాహేబ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి వైఎస్‌ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందరర్భంగా వెఎస్‌ జగన్కు ముస్లిం సోదరులు ఖర్జూరాలు తినిపించారు

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్‌ హాలులో రసూల్‌ సాహేబ్‌ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం, మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు