కువైట్‌లో ఘనంగా జగన్ జన్మదినవేడుకలు

23 Dec, 2014 02:15 IST|Sakshi
కువైట్‌లో ఘనంగా జగన్ జన్మదినవేడుకలు

కడప కార్పొరేషన్/ సుండుపల్లె : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను కువైట్‌లోని మాలియా ప్రాంతంలో ఘనంగా నిర్వహించినట్లు కువైట్ కమిటీ కో ఆర్డినేటర్  బీహెచ్ ఇలియాస్, జాయింట్ కో ఆర్డినేటర్ మమ్మడి బాలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడే రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రజానాయకుడ న్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో పనిచేస్తున్నందుకు తామంతా గర్వంగా భావిస్తున్నామన్నారు. 2019లో ఈ రాష్ట్రానికి కాబోయే  ముఖ్యమంత్రి జగనేనన్నారు.

ఈ కార్యక్రమంలో కువైట్ కమిటీ సభ్యులు భాస్కర్‌రెడ్డి, ఎంవీ నరసారెడ్డి, నాయని మహేష్, గోవిందు నా గరాజు, సీ. చంద్ర శేఖర్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్, షేక్ అన్సర్, లలిత్ రాజ్, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, రమణయాదవ్, షేక్ ఇనాయత్, ఏవి సుబ్బారెడ్డి, షేక్ ఇక్బాల్, నాగిరెడ్డి, చంద్ర, వాసు, వెంకట్, కళ్యాన్, న్యాజ్, సజ్జద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కువైట్‌లో జరిగిన జన్మదినవేడుకలలో  వైఎస్సార్ సీపీ కువైట్ అడహక్ కమిటీ సభ్యులు పి.రహిమాన్‌ఖాన్, రఫీ, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, మహబూబ్‌బాషా పాల్గొని కేక్‌ను కట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు