విశాఖపట్నం :‘ఈ శుక్రవారం వివాహం చేసుకున్నాం. జగనన్న పాదయాత్ర మా ఊరి మీదుగా వస్తుందని తెలిసి వెనువెంటనే వచ్చాం. ఆయన మమ్మల్ని చూసి ఆగి మా జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు. మా జీవితం బాగుండాలని ఆకాంక్షించారు. ఈ అద్భుత జ్ఞాపకం మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది’ ఇదీ నూతన జంట గోడి జార్జి నాని, హరిత ఆనందం. విశాఖకు చెందిన ఈ జంట శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహం అయిన తరువాత ఎట్టిపరిస్థితిలోనూ జగన్మోహాన్రెడ్డి ఆశీర్వచనం తీసుకుకోవాలని నిశ్చయించుకుని నర్శీపట్నం చేరుకున్నారు. ఆదివారం మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామం వద్ద ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డిని నేరుగా కలుసుకుని ఆశీసులు తీసుకున్నారు. అలాగే మాకవరపాలెం మండలం సుబ్బరాయుడుపాలెనికి చెందిన మరో నూతన జంటను కూడా జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు.