హైదరాబాద్: మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత డా.సి.నారాయణరెడ్డి మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తెలుగు సాహిత్యరంగంలో ఓ మహా ధ్రువతార నేలరాలిందని, సినారె మరణం తెలుగుజాతికి తీరనిలోటు అని వైఎస్ జగన్ అన్నారు.
రైతు కుటుంబంలో పుట్టిన సినారె తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారని, కవిగా, మృదుభాషిగా, మానవతావాదిగా, సినీ గేయరచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా.. ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని వైఎస్ జగన్ అన్నారు. సినారె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్ జగన్.. తన ప్రగాఢ సంతాపం తెలిపారు.