సాహిత్య చరిత్రలో పెద్దిభొట్లది ప్రత్యేక స్థానం: వైఎస్‌ జగన్‌

18 May, 2018 18:10 IST|Sakshi

రచయిత మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంతాపం

సాక్షి, గోపాలపురం : విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కార గ్రహీత పెద్దభొట్ల సుబ్బరామయ్య మృతిపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 350కి పైగా కథనలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి పెద్దభొట్ల విశేష సేవలందించారని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. తెలుగు సాహిత్య చరిత్రలో పెద్దిభొట్ల ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. పెద్దిభొట్ల కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విఖ్యాత రచయిత పెద్దిభొట్ల కన్నుమూత

మరిన్ని వార్తలు