కుడిపూడి చిట్టెబ్బాయికి జగన్‌ పరామర్శ

26 Jul, 2017 11:19 IST|Sakshi

హైదరాబాద్‌ : నగరంలోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టెబ్బాయిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిన్న (మంగళవారం) పరామర్శించారు. చిట్టెబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

వైఎస్‌ జగన్‌ వెంట పార్టీ నేతలు విశ్వరూప్‌, చలమలశెట్టి సునీల్‌, కురసాల కన్నబాబు ఉన్నారు. తాను ఆస్పత్రిలో చిట్టెబ్బాయిని కలిశానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్‌ జగన్‌  వైఎస్ఆర్‌ సీపీ ట్విట్టర్‌ అకౌంట్‌ లో  ఓ ఫోటోను కూడా పెట్టారు.

మరిన్ని వార్తలు