వైఎస్‌ జగన్‌ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌

4 Apr, 2019 20:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపటి (శుక్రవారం) ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 5న కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు చిత్తూరు జిల్లా  కుప్పంలో పర్యటిస్తారు. 11.30 గంటలకు కడప జిల్లా జమ్మలమడుగులో ప్రచారం నిర్వహిస్తారు. 1.30 గంటలకు గుంటూరు పట్టణంలోపర్యటిస్తారు. అనంతరం 3.30 గంటలకు విజయవాడ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పాల్గొంటారు.

ఉభయగోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 5న వైఎస్‌ షర్మిల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు తణుకులోని నరేంద్ర సెంటర్‌లో, మధ్యాహ్నం 3:30గంటలకు కొత్తపేటలో, సాయంత్రం 5:50గంటలకు ఆచంట మెయిన్‌ సెంటర్‌లో, రాత్రి 8:10గంటలకు నర్సాపురంలోని స్టీమర్‌ రోడ్‌లో ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్‌ విజయమ్మ చిత్తూరులోని మూడు నియోజకవర్గాల్లో (పూతలపట్టు, పీలేరు, చంద్రగిరి) రేపు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు