‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పథకం ప్రారంభం

31 May, 2019 13:06 IST|Sakshi

పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60కి తగ్గింపు

సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెన్షన్ల పెంపుదలపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వృద్ధుల పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్‌ పథకం అందుతుంది.  వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2250, వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు చెల్లిస్తారు.

కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రసంగించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సంతకం వృద్ధులకు పింఛను పెంపు ఫైల్‌పై చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ ఈ ఏడాది జూన్‌ 1 వతేదీ నుంచి 2,250 పింఛను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. దశలవారీగా రెండో ఏడాది మరో రూ.250, మూడో ఏడాది మరో రూ.250, నాల్గో ఏడాదికి పింఛను రూ.3 వేలకు పెంచుతానని వివరించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీచేసింది.

పెన్షన్‌ జీవో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ]

మరిన్ని వార్తలు