సాక్షి, అమరావతి: ప్రముఖ వాణిజ్య ప్రకటనల ఏజెన్సీ ‘ఎయిమ్ వ్యాప్తి అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఎండీ వేంపల్లి నిరంజన్ రెడ్డి రూపొందించిన ‘లీడర్ టు లీడర్ 2018’ డైరీని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలోని ప్రజాసంకల్పయాత్రలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..మహానేత వైఎస్సార్ మరణానంతరం 2010 ఏడాది నుంచి ప్రతీఏటా ఈ డైరీని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవిత విశేషాలతో పాటు వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్ర, ప్రత్యేక హోదా సాధనకై జగన్ చేస్తున్న పోరాటాలను, వైఎస్ షర్మిల చేసిన పాదయాత్ర తదితర అంశాలను ఫొటోలతో సహా ఈ డైరీలో పొందుపరిచినట్లు వివరించారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘ఎయిమ్ వ్యాప్తి’ సంస్థ ఉద్యోగులు మధుకర్, కిరణ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.