మంచినీటి పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్

18 Aug, 2015 17:02 IST|Sakshi

సింహాద్రిపురం :వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులోని అంకాలమ్మ దేవాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అంకాలమ్మతోపాటు పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ నిధులతో గ్రామంలో చేపట్టిన మంచినీటి పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు