203వ రోజు పాదయాత్ర ప్రారంభం

2 Jul, 2018 08:22 IST|Sakshi

సాక్షి, ముమ్మిడివరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 203వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొమరగిరి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు.

అక్కడి నుంచి పాత ఇంజారం, యానం బ్రిడ్జి, సుంకరపాలెం, చింతకులవరిపేట, ఇంజారం మీదుగా కోలంక వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావడంతో పాదయాత్ర పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.

మరిన్ని వార్తలు