274వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

29 Sep, 2018 19:03 IST|Sakshi

సాక్షి, ఎస్‌.కోట: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టి ప్రజాసంకల్పయాత్ర 274వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌, గజపతినగరం నియోజకవర్గం జామి మండలంలోని నైట్‌ క్యాంప్‌ శిబిరం పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బలరాంపురం, కుమరాన్‌, కోరుకొండ మీదుగా పాదయాత్ర సాగుతుంది. అక్కడ మధ్యాహ్నా భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చిన్నాపురం జంక్షన్‌, కొరాడపేట, చాకలిపేట, జొన్నవలస క్రాస్‌ మీదుగా పాదయాత్ర సాగనుంది.  ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం ప్రకటనలో తెలిపారు.


ముగిసిన పాదయాత్ర: విజయనగరంలో శనివారం పాదయాత్ర ముగిసింది. శనివారం రోజున వైఎస్‌ జగన్‌ 11.1 కిలో మీటర్లు నడిచారు. దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగిన మార్గంలో పండుగ వాతావరణం కనిపించింది. జిడ్డేటి వలస క్రాస్‌ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్‌ రోడ్డు, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్‌ రోడ్డు, యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి మీదుగా పాదయాత్ర సాగింది.

మరిన్ని వార్తలు