మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

2 Jul, 2015 21:37 IST|Sakshi

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో హుకుంపేటకు చేరుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం హుకుంపేటలో సముద్రంలో గల్లంతైన ముగ్గురు మత్య్సకారుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.

అంతకముందు విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన 22 మంది కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం తుని సమీపంలోని పెరుమాళ్లపురంలో సభలో ఆయన ప్రసంగించారు.

మరిన్ని వార్తలు