మధ్యాహ్నం 2గం. హైదరాబాద్కు జగన్

22 Jan, 2014 11:54 IST|Sakshi

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ రానున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మృతి సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రను జగన్ వాయిదా వేసుకున్నారు.

కాగా వైఎస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈరోజు ఉదయం అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమెతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు సుచరిత, శోభా నాగిరెడ్డి ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు