ప్రజలకు వైఎస్‌ జగన్‌ హోలీ శుభాకాంక్షలు

21 Mar, 2019 07:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హోలీ పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో హోలీ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలన్నారు.ఈ మేరకు వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం ట్విట్‌  చేశారు. 

కాగా గత ఏడాది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను పలువురు విద్యార్థులు కలిసి...ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు