పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి

13 Jul, 2016 11:53 IST|Sakshi

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఆయన జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లో క్వాలిటీ పొగాకుకు కనీస ధర ఇవ్వడం లేదని రైతులు ...వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిపై పొగాకు బోర్డు అధికారులను నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు