రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌

1 Sep, 2019 14:30 IST|Sakshi

అమరావతి: వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు