తెలుగు ప్ర‌జ‌ల‌కు వైఎస్‌ జగన్‌ హోలీ శుభాకాంక్ష‌లు

20 Mar, 2019 21:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తుందని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలకు దోహదపడుతుందని అన్నారు. జాతీయ సమగ్రతను ఈ పండుగ పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ ఒక ప్రకటనలో విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు