తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్

14 Jan, 2015 11:09 IST|Sakshi
తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్

హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు.

 

అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడి పంటలకు నెలవు కావాలని వైఎస్ జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని, ఇరు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆయన కోరారు.

 

మరిన్ని వార్తలు