హర్షవర్థని.. వర్ష వర్థని

19 Aug, 2018 06:59 IST|Sakshi

కవలలకు నామకరణం చేసిన జగన్‌

తమ కవల ఆడ పిల్లలకు పేర్లు పెట్టాలని నాతవరం మండలం పీకే గూడెంనకు చెందిన పైలా రమణబాబు, పద్మ దంపతులు శనివారం కృష్ణాపురం వద్ద వైఎస్‌ జగన్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. బోసి నవ్వులు నవ్వుతున్న ఈ చిన్నారులిద్దర్ని గుండెలకు హత్తుకుని ముద్దాడిన జననేత వారికి హర్షవర్థని, వర్షవర్థని అని నామకరణం చేశారు. దీంతో ఆ తల్లిదండ్రులిద్దరూ పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రజాసంకల్ప యాత్రలో మా గ్రామానికి వస్తున్న వైఎస్‌ జగన్‌తో మా పిల్లలకు పేర్లు పెట్టించుకోవాలని నిర్ణయించుకున్నామని, అనుకున్నట్టుగానే మా పిల్లలకు జననేత పేర్లు పెట్టడం తమకెంతో ఆనందంగా ఉందని పైలా రమణబాబు, పద్మ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వారిద్దర్ని బాగా చదివించి పైకి తీసుకురావాలని జగన్‌ సూచించారని, ఆయన ఆశయం మేరకు వారిద్దర్ని బాగా చదివించుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు