మంత్రి దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్

25 Dec, 2014 12:03 IST|Sakshi

కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్  నుంచి గండికొట వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చాలని, పులివెందుల బ్రాంచి కెనాల్కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు.

 

మరిన్ని వార్తలు