సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త పీవీ

29 Jun, 2020 03:00 IST|Sakshi

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి 

సాక్షి, అమరావతి: దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ‘పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త. అంతే కాదు, ఒక బహుభాషా కోవిదుడు. ఈ దేశాన్ని పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాల వైపు నడిపించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు