144వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

23 Apr, 2018 19:57 IST|Sakshi

సాక్షి, గన్నవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 144వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన పాదయాత్ర గోపవరపుగూడెం శివారు నుంచి ప్రారంభం కానుంది. అక్కడ నుంచి కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకటనరసింహాపురం కాలనీ, గన్నవరం మీదగా దావాజీగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార‍్యదర్శి తలశిల రఘురాం షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ముగిసిన 143వ రోజు పాదయాత్ర
వైఎస్‌ జగన్‌ 143వ రోజు పాదయాత్ర ముగిసింది. ఇవాళ ఆయన 12.3 కిలోమీటర్ల మేర నడిచారు. సోమవారం ఉదయం చిన్న ఆగిరిపల్లి, తోటపల్లి, గొల్లనపల్లి, చిక్కవరం క్రాస్‌ మీదగా గోపవరపుగూడెం వరకూ పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకూ వైఎస్‌ జగన్‌ 1854.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

మరిన్ని వార్తలు