సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 146వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆయన గురువారం ఉదయం గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం వెంటకరామపురం రాత్రి శిబిరం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఇందుపల్లి మీదగా నందమూరు క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.