సైదాపురం: ఈ నెల 29, 30వ తేదీల్లో సైదాపురం మండలంలో జరగనున్న ప్రజాసంకల్ప యాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కోరారు. సైదాపురంలో జెడ్పీ చైర్మన్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి బహిరంగ సభ, విజయస్థూప నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 29న సైదాపురంలో బహిరంగ సభను నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
అనంతరం సోమవారం రాత్రి జగన్మోహన్రెడ్డి బస చేసే ప్రదేశాన్ని పరిశీలించి, ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నాయకులను కోరారు. సభ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పలు సూచనలు, సలహాలను అందజేశారు. సైదాపురం మండలంలో 17 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారని వివరించారు. 25 అడుగులతో నిర్మిస్తున్న స్థూపానికి సంబంధించిన వివరాలను బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వివరించారు.
నియోజకవర్గంలోని కలువాయి, డక్కిలి, రాపూరు, బాలాయపల్లి, వెంకటగిరి మండలాల వారు కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు రూప్కుమార్యాదవ్, పేర్నేటి శ్యామ్ప్రసాద్రెడ్డి, కలువాయి జెడ్పీటీసీ అనిల్కుమార్రెడ్డి, సైదాపురం సర్పంచ్ బండి వెంకటేశ్వర్లురెడ్డి, నాయకులు బండి సుబ్బారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఢిల్లీబాబు, బండి గంగాధర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.