నాలుగోరోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర

14 May, 2015 10:52 IST|Sakshi

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగో రోజు కొనసాగించనున్నారు. గురువారం ఆయన జిల్లాలోని నారదాపురపల్లి, తిమ్మాపురం లలో  పర్యటించనున్నారు. నారదాపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ హుస్సేనప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం తిమ్మాపురంలో ఆత్మహత్య చేసుకున్న పుల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ తరువాత అదే గ్రామంలో  డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

 

>
మరిన్ని వార్తలు