సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్ తిరిగి విజయవాడ చేరుకున్నారు. కాగా, ఈనెల 7న ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ఎల్పీ సమావేశం జరగనుంది.