వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌

6 Nov, 2017 08:50 IST|Sakshi

సాక్షి, ఇడుపులపాయ : ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించేందుకు వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించి అనంతరం సభావేదికకు చేరుకుంటారు.  

ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో రాత్రి బస చేస్తారు.


(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు