దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ బృందం కూడా సాయంత్రం నాలుగు గంటలకు హోం మంత్రిని కలుస్తుంది.
ఓటుకు కోట్ల వ్యవహారంపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎ-1గా చేర్చాలంటూ కేంద్ర హోం మంత్రికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం ఇవ్వనున్నారు.