నెల్లూరులో రేపు జగన్ సమైక్య శంఖారావం రద్దు

31 Jan, 2014 11:34 IST|Sakshi
నెల్లూరులో రేపు జగన్ సమైక్య శంఖారావం రద్దు

హైదరాబాద్ : ఫిబ్రవరి 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో శనివారం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం రద్దు అయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్  కన్వీనర్ తలశిల రఘురాం ప్రకటించారు.

కాగా సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.

>
మరిన్ని వార్తలు