‘ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’

19 Jun, 2020 21:19 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : గాల్వన్‌ సంక్షోభ సమయంలో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సరైన మార్గంలో విజయవంతగా నడిపిస్తారని నమ్ముతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన 20 మంది వీరసైనికుల మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలకు సెల్యూట్‌ చేస్తున్నట్టు చెప్పారు. అమరులైన సైనికుల కుటుంబాలకు అందరం తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఏ వ్యుహాత్మక నిర్ణయం తీసుకున్నా దానిని తాము కట్టుబడి ఉంటామని మోదీకి చెప్పారు. 

మరిన్ని వార్తలు