శ్రీకాకుళం , పోలాకి: ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో వలంటీర్గా పనిచేయడంలో ఎంతో ఆనందంగా ఉందని సంతకవిటి మండలం గరికిపాడుకు చెందిన యువకుడు బార్నాన అచ్చెన్నాయుడు అన్నారు. చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ పాదయాత్రలో కలిసి నడుస్తానని జగన్ను కోరటంతో ఆయన అవకాశం కల్పించారు. దీంతో విజయవాడ నుంచి పాదయాత్రలో వాలంటీర్గా పాల్గొంటున్నానని తెలిపాడు.
అన్న అడుగులో అడుగేస్తూ.. నడుస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నాడు. పాదయాత్రలో జగన్ను కలిసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లే క్రమంలో అచ్చెన్నాయుడు తన వంతు బాధ్యతను తీసుకుంటున్నాడు. ఇటీవల పలాస నియోజకవర్గంలో ఓ అభిమాని బంగారు గొలుసును పాదయాత్రలో పోగొట్టుకుని బాధపడుతుంటే.. తనకు దొరికిన ఆ వస్తువును బాధితుడికి అందజేసి.. తన నిజాయితీని చాటుకున్నాడు అచ్చెన్నాయుడు.