నారాయణ కుటుంబానికి అండగా ఉంటా: సీఎం జగన్‌

6 Dec, 2019 16:52 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దిగువపల్లిలో నారాయణ మృతదేహానికి వైఎస్‌ జగన్‌ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నారాయణ మృతి చెందడంతో వైఎస్‌ జగన్‌ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం జగన్‌ వెంట ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా ఉన్నారు.



పలువురి నివాళి:
అనార్యోగంతో మృతి చెందిన సీఎం జగన్‌ వ్యక్తిగత సహాయ కార్యదర్శి దంపెట్ల నారాయణ మృతదేహానికి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళర్పించారు.
(సీఎం జగన్‌ వ్యక్తిగత సహాయకుడు అనారోగ్యంతో మృతి)


 

మరిన్ని వార్తలు