ఆంధ్రకేసరికి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

23 Aug, 2018 15:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయనకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌ గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను వైఎస్‌ జగన్‌ స్మరించుకున్నారు. రాష్ట్రానికి టంగుటూరి చేసిన సేవలను కొనియాడారు.

     

మరిన్ని వార్తలు