గుజరాత్‌ సీఎంకు ఏపీ సీఎం జగన్‌ ఫోన్‌..

21 Apr, 2020 11:29 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. గుజరాత్‌ సీఎంకు విజ్ఞప్తి చేశారు. వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తిపై గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు