విజయనగరం : మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో అత్యవసర సమయంలో ఆస్పత్రులకు కూడా వెళ్లలేకపోతున్నాం. విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరీ దారుణం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే 43వ జాతీయ రహదారి నుంచి జన్నివలసతో పాటు పక్కనే ఉన్న ఆరు గ్రామాలకు తారురోడ్డు సౌకర్యం కల్పించాలి.– పతివాడ చంద్రశేఖర్, జన్నివలస, రామభద్రపురం మండలం