192వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌

17 Jun, 2018 19:45 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 192వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌ పాదయాత్రను గంటి నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. బోడపాటివారి పాలెం మీదుగా పీ గన్నవరం వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

ముగిసిన పాదయాత్ర: ఆదివారం ఉదయం 191వ రోజు ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా వెదిరేశ్వరం ఎంపీపీ స్కూల్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వెదిరేశ్వరం, కేతరాజుపల్లి, దేవరపల్లి, ఈతకోట, పలివెల క్రాస్‌, గంటిపల్లిపాలెం క్రాస్‌ మీదుగా గంటి వరకు పాదయాత్ర కొనసాగింది. జననేత వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ రోజు జననేత 12.2 కిలో మీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకు 2,366.8 కిలోమీటర్లు నడిచారు. 

మరిన్ని వార్తలు