193వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌

18 Jun, 2018 21:01 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌ పాదయాత్రను పి.గన్నవరం నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

ముగిసిన పాదయాత్ర: సోమవారం ఉదయం 192వ రోజు ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా గంటి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి, ఎర్రం శెట్టివారి పాలెం,  బోడపాటివారి పాలెం మీదుగా పీ గన్నవరం వరకు పాదయాత్ర కొనసాగింది. జననేత వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. 

మరిన్ని వార్తలు