265వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

17 Sep, 2018 20:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 265వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆయన భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నెట్టేరు, పాలవలస, సీతమ్మపాలెం, పందలపాక బీసీ కాలనీ, పందలపాక క్రాస్ రోడ్డు, తర్లువాడ, బాకురుపాలెం క్రాస్ రోడ్డు మీదుగా ముచ్చెర్ల క్రాస్‌ రోడ్డు వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 264వ రోజు పాదయాత్ర ఆనందపురంలో ముగిసింది. నేడు జననేత పాదయాత్ర గుమ్మడివాని పాలెం, నీళ్లకుండీలు జంక్షన్‌, మమిడివానిపాలెం, గుడిలోవ జంక్షన్‌, తర్లువాడ జంక్షన్‌, ఎల్‌వీపాలెం మీదుగా ఆనందపురం జంక్షన్‌ వరకు 9.1 కిలీమీటర్లు సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 2,969.5 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు