సాక్షి, నర్సాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 176వరోజు షెడ్యూల్ ఖరారు అయింది. బుధవారం ఉదయం ఆయన కొప్పర్రు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి లిఖితపూడి, సారి పల్లి మీదగా పాదయాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం చిన్నమామిడిపల్లి, నర్సాపురం, స్టీమర్ రోడ్డు వరకూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు.
175వ రోజు ముగిసిన యాత్ర: 175వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. మంగళవారం 10.8 కిలోమీటర్లు వైఎస్ జగన్ నడిచారు. తలతాడితిప్ప, మెంటేపూడి క్రాస్, బొబ్బనపల్లి, మత్స్యపురి, సీతారామపురం క్రాస్ మీదుగా కొవ్వూరు వరకు ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఇప్పటి వరకు 2192.5 కిలోమీటర్ల దూరం వైఎస్ జగన్ నడిచారు.