266వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

18 Sep, 2018 20:35 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 266వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం జననేత పాదయాత్రను ముచ్చెర్ల క్రాస్‌ నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సెంచురియన్‌ యునివర్సిటీ, గిడిజాల, వేమగొట్టిపాలెం మీదుగా పప్పలవాని పాలెం క్రాస్‌ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 265వ రోజు పాదయాత్ర మంగళవారం ముచ్చెర్ల క్రాస్‌ వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర నెట్టేరు, పాలవలస, సీతమ్మపాలెం, పందలపాక బీసీ కాలనీ, పందలపాక క్రాస్‌ రోడ్డు, తర్లువాడ, బాకురుపాలెం క్రాస్‌ రోడ్డు మీదుగా ముచ్చెర్ల క్రాస్‌ రోడ్డు వరకు 9.6 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 2,979.1 కిలోమీటర్లు నడిచారు.


 

మరిన్ని వార్తలు