స్వామి వివేకానందకు సీఎం జగన్‌ నివాళి..

12 Jan, 2020 14:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘గొప్ప మేధావి, తత్వవేత్త స్వామి వివేకానందకు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.. అనే ఆ మహానీయుడి సూక్తిని యువత పాటించాలి’ అని సూచించారు. 

మరిన్ని వార్తలు