జాలర్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి 

30 Nov, 2018 23:07 IST|Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి  

సాక్షి, అమరావతి: పాకిస్తాన్‌ చెరలో బందీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాలర్లను విడిపించే విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌ కోస్టు గార్డులను అరెస్ట్‌ చేసి జాలర్లను విడిపించి క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చే విధంగా భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఒక ట్వీట్‌ చేశారు.  ( ఇది చదవండి: గొల్లుమన్న మత్స్యకార పల్లెలు)

మరిన్ని వార్తలు