చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారు: వైఎస్ జగన్

16 May, 2015 17:26 IST|Sakshi
చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారు: వైఎస్ జగన్

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆరో రోజు శనివారం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఉజ్జహల్లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. గ్రామాల్లో పేదలు పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్జహల్ సభలో వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు వాగ్దానాలను నమ్మి తాము మోసపోయామని డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్తో మొరపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు